23, నవంబర్ 2013, శనివారం



మునెమ్మ ప్రతీకారం...
మునెమ్మ నవల 2008లో ప్రచురితమైంది. రచయిత డాక్టర్ కేశవరెడ్డి.

కథా విషయం:–

మునెమ్మ పల్లెటూరి పడుచు. జయరాముడు ఆమె భర్త. అతను మొరటుదనం, కరుకుదనం కలిగిన మనిషి. తనకు తోచింది తప్ప ఎవరి మాటా వినే రకం కాదు.

మునెమ్మ అత్తవారింట కాపురానికి వచ్చిన రోజే పుట్టిన బొల్లిగిత్త అంటే ఆమెకూ, కుటుంబ సభ్యులకే కాదు, ఆ ఊరి వారందరికీ ఇష్టమే. వీధిలో పోతూ ఉంటే జయరాముణ్ణీ, బొల్లిగిత్తనూ రామలక్ష్మణులనేవారు. బొల్లిగిత్తను తమ బిడ్డగా భావించి మునెమ్మ జయరాములిద్దరూ తమ చేతి మీద దాని బొమ్మ పచ్చ పొడిపించుకుంటారు. ఆ బొల్లిగిత్త వారి జీవనాధారం కూడా.

ఒకరోజు బొల్లిగిత్త మునెమ్మ మీదకు రెండు కాళ్లతో లేచి లైంగిక చేష్ట లాంటిది ప్రదర్శించటం చూసిన జయరాముడు రెచ్చిపోయి పారతో దాడి చేస్తాడు. చావబాదినా బొల్లిగిత్తపై కోపం తగ్గక దాన్ని సంత (పరస)లో అమ్మేసి కొత్త గిత్తను కొంటానని అక్కణ్ణించి ఆవేశంగా వెళిపోతాడు. ఈ సన్నివేశంతోనే కథ మొదలవుతుంది. ఈ కథ అంతట్నీ మనకు చెప్పేది జయరాముడి దూరపు చుట్టమైన సినబ్బ.

జయరాముని తల్లి సాయమ్మ బొల్లిగిత్తను జయరాముడు చావబాదాడని మునెమ్మ ద్వారా తెలుసుకుంటుంది. జయరాముణ్ణి తిడుతుంది. అతనికి ఈ మొండితనమూ, అకారణంగా కోపం తెచ్చుకోవటము లాంటి లక్షణాలన్నీ అతని తండ్రి (తన భర్త) దొరసామి నుంచే వచ్చాయంటుంది.

సాయమ్మ భర్త దొరసామి తాగుబోతు, వ్యక్తిత్వ పరంగా మొరటువాడు, ఎవరికీ తలవంచడు. నాటకాలంటే ఆసక్తి లేకపోయినా ఆ హడావుడిని ఇష్టతాడు. ఊళ్లో నాటకాలొస్తే దొరసామి భార్య సాయమ్మ తన పట్టుచీరను అతనికి తెలియకుండా నాటకాలవాడికి ద్రౌపది వేషం కోసమని ఇస్తుంది. దొరసామి తన భార్య చీర పరాయి మగవాడు కట్టుకోవడాన్ని భరించలేక ఆవేశానికి లోనై నాటకాల వాణ్ణి కత్తితో నరికి చంపుతాడు. జైలుపాలవుతాడు. అక్కడ కూడా తోటి ఖైదీలతో గొడవలు పడుతూ, అధికారుల్ని ఎదిరిస్తూ, ఒక రోజు కొందరు ఖైదీలతో కలిసి జైలు నుండి పారిపోతాడు. వారిలో కొంతమంది పోలీసు కాల్పుల్లో చనిపోతారు. వాళ్లలో దొరసామి ఉన్నదీ లేనిదీ ఎవరూ నిర్థారించి చెప్పకపోవటంతో ఎప్పటికీ అతని ఆచూకీ తెలియకుండా పోతుంది. సాయమ్మ మాత్రం భర్త బుద్ధులు తన కొడుక్కీ రాకూడదని దేవుణ్ణి ప్రార్థిస్తుంది. ఈ కథనంతా ఆమె సినబ్బతో నెమరు వేసుకుంటుంది.

ప్రస్తుతంలోకి వస్తే... ఇంటికి వచ్చిన జయరాముడు సంతకి బొల్లిగిత్తను అమ్మడానికి తీసుకు వెళ్తున్నట్టు చెప్తాడు. సాయమ్మ మొదట వ్యతిరేకిస్తుంది గానీ, మునెమ్మ పట్ల బొల్లిగిత్త ప్రవర్తించిన తీరు తెలుసుకున్నాకా, అమ్మేయటమే మంచిదంటుంది.

పొరుగూరిలోని పశువుల సంత దాకా తన ప్రయాణ ప్రణాళిక ఏమిటన్నది మొత్తం జయరాముడు ఆ రాత్రి తన తల్లికి చెప్తాడు. ఒంటరిగా కాకుండా, పశువుల దళారి తరుగులోడిని కూడా వెంటబెట్టుకు వెళ్తున్నట్లు చెప్తాడు.

అలా వెళ్లినవాడు రెండ్రోజులైనా తిరిగి రాకపోయేసరికి సాయమ్మ, మునెమ్మ కంగారు పడతారు. ఇంతలో మునెమ్మకు కల వస్తుంది. దాని ఆధారంగా తన భర్త బతికి లేడనే నిర్ణయానికి వస్తుంది. పైగా మరుసటి రోజు బొల్లిగిత్త ఒంటరిగా ఇంటికి తిరిగి వస్తుంది. దాని కొమ్ముకున్న సంత చీటీ అనే ఒక్క ఆధారాన్నీ పట్టుకుని మునెమ్మ భర్త కోసం బయల్దేరుతుంది. వెళ్తూ సినబ్బ (మనకు కథ చెప్తున్న పాత్ర)ను కూడా వెంటబెట్టుకు వెళ్తుంది.

దళారి తరుగులోణ్ణి ఆరా తీస్తుంది. అతని మాటల్లో తడబాటును బట్టి అతను చెప్తున్నది అబద్ధమని మునెమ్మకు రూఢీ అవుతుంది. పూటకూళ్ల ముసలి దంపతులను, సంత సంచాలకుణ్ణి, సంతలో కల్లుపాక యజమానినీ విచారించిన తర్వాత, తన భర్త జయరాముడు బొల్లిగిత్తను పశువుల వైద్యం చేసే మందులోడికి అమ్మినట్టు తెలుసుకుంటుంది మునెమ్మ. సినబ్బతో కలిసి అతని ఊరు రామినాయుడు పల్లెకు వెళ్తుంది. అక్కడికి చేరే సరికి మందులోడు మరణశయ్య మీద ఉంటాడు. ఆవుకి వైద్యం చేయబోతే కొమ్ము విసిరిందని అతని భార్య అబద్ధం చెపుతుంది. అసలే చావుబతుకుల్లో ఉన్న మందులోడు మునెమ్మ ఎడం చేతి మీద బొల్లిగిత్త పచ్చబొట్టు చూసి భయంతో చచ్చిపోతాడు. దాంతో బొల్లిగిత్తే మందులోడి చావుకి కారణమని మునెమ్మ అనుమానిస్తుంది. తర్వాత అతని పెద్ద కొడుకు ద్వారా నిజం తెలుసుకుంటుంది మునెమ్మ. మందులోడూ తరుగులోడూ ఇద్దరూ కలిసి తన భర్తని చంపేశారని ఖాయపర్చుకుంటుంది. ఇక మిగిలిన తరుగులోడిపై మునెమ్మ ఎలా ప్రతీకారం తీర్చుకుందన్నదే ముగింపు.

నా అభిప్రాయంలో మునెమ్మ:–

కథ ప్రారంభంలో మునెమ్మ పాత్ర అమాయకంగా కనిపించినా, భర్త హంతకుల్ని వెతికే క్రమంలో ఆమె ఎక్కడ లేని మొండి ధైర్యాన్ని, ప్రవర్తనలో పరిణతినీ ప్రదర్శిస్తుంది. భర్త ఇక లేడు అనే భావనే ఆమెలో అంతకుముందు లేని ఈ నిబ్బరాన్నీ, నేర్పరితనాన్నీ కల్పించాయనిపిస్తుంది. నాకు ఇక ఎవరూ లేరు అనే భావన రాగానే ప్రతి స్త్రీలోనూ మొండిధైర్యం ప్రవేశిస్తుంది.

మునెమ్మ తనలోని అనుమానాలను చూపుల ద్వారా తెలుపుతుందే కానీ, మనసు విప్పి ఎవరితోనూ పంచుకోదు. మాట్లాడిన కాసిని మాటల్లోనూ తాత్త్విక ధోరణి తొంగి చూస్తుంది. ఆ మాటలు ఎక్కడా పల్లెపడుచు మాటలుగా మనకు అనిపించవు.
“కాలు దీసి వీధిలో పెడితే దారి దానంతట అదే తెలుస్తుంది. భూమ్మీదికి వచ్చే ముందు ఎలాటి బతుకు బతుకుతాం? ఎక్కడ బతుకుతాం? ఇవన్నీ ఆలోచించే వచ్చామా?”
“అడుగుదాం. సమయమొచ్చినపుడు గొంతు మీద కాలేసి అడుగుదాం. చేప కోసం గాలం వేసినప్పుడు బెండు తైతక్కలాడగానే గాలాన్ని లాగుతామా? బెండు నీళ్ళలో మునిగినప్పుడు గదా గాలాన్ని లాగుతాం.”
ఇలాంటి తాత్త్విక ధోరణీ, ఈ అరుదైన పోలికలూ మునెమ్మవా, లేక రచయితవా అనే సందేహం కలుగుతుంది.

కానీ ఆమె ఇలా ఎంత అరుదైన ఉపమానాలు వాడినా, ఎంత లోతైన తాత్విక ధోరణి ప్రదర్శించినా, ఆమె మాటల్లోని యాస వల్ల మనం కాస్త సులువుగానే సమాధాన పడతాం. కానీ కథను మనకు చెప్పే సినబ్బ విషయంలో అలా సమాధాన పడలేం. అతని మాట తీరూ, అతను వాడే పదజాలమూ, కథను నేర్పుగా వెనకా ముందులు చేసి చెప్పటం... వీటి వల్ల మనకు కథ చెప్పేది ఒక పల్లెటూరి యువకుడని అనిపించదు. బాగా విజ్ఞానవంతుడెవరో చెప్తున్నట్టు అనిపిస్తుంది.
“వాస్తవ జగత్తులోని సంఘటనలు మనిషి జీవితాన్ని పూర్తిగా మార్చివేయడం మనం చూసినదే. అలాగే స్వప్న జగత్తులో జరిగిన సంఘటనలు కూడా జీవిత దృక్పథాన్ని మార్చివేయగలవని నేను చెప్పగలను. అందుకు మునెమ్మే సాక్ష్యం. స్వప్నంలో ఆమె చూసిన దృశ్యాలు ఆమెలోని ప్రతి అణువునూ కుదిపి వేశాయి. స్వప్నానంతరం ఆమె కార్చిన కన్నీళ్ళు, ఆమెలోని సకల సందిగ్ధతలను, సకల సంశయాలను, సకల జడత్వాలను కడిగి వేశాయి.”
ఇలా సాగుతుంది సినబ్బ కథనం. మునెమ్మకు రచయిత తన ఉపమానాల్ని మాత్రమే అరువిచ్చాడు. సినబ్బకు తన శైలి కూడా అరువిచ్చేశాడని అనిపిస్తుంది. ఈ శైలి కథా వాతావరణానికి నప్ప లేదు. సినబ్బ కూడా మునెమ్మలా యాసలో మాట్లాడి ఉంటే కథకు బాగా నప్పేదేమో అనిపిస్తుంది. ఇలాంటివి కొన్ని లోటుపాట్లుగా అనిపించినా కథలో ఉత్కంఠ కారణంగా మనం మనసులోనే సమాధాన పడుతూ చదువుకుంటూ పోతాం. పైగా ఈ రచన మేజికల్ రియలిజం అనే ధోరణి ఆధారంగా రాసిందని అన్నారు గనుక, ఇలాంటి పొసగని అంశాలు ఎన్నో ఆ పేరు మీద చెల్లిపోతాయి.

భర్త హంతకుల్ని చంపటమే భర్తకు తాను చేసే అంత్యక్రియలుగా భావిస్తుంది మునెమ్మ. పట్టుదలగా వాళ్లని వెంటాడి తుదముట్టిస్తుంది. ప్రతీకారం కోసం ఆమె ప్రయాణమే ఈ నవల.

ఈ సమీక్ష పుస్తకం.నెట్‌లో ప్రచురితం

3, నవంబర్ 2013, ఆదివారం

నా  మీద నీకు ప్రేమ వుంటే

ఆనందాన్ని పంచుకుంటే అది రెట్టింపు అవుతుంది. దుఃఖాన్ని పంచుకుంటే అది సగమవుతుంది. ఎవరితోనూ పంచుకోని దుఃఖం ఏమవుతుంది? కొండల్లా పెరుగుతుంది. నిజానికి ప్రతి ఒక్కరికీ ఎవరో ఒకరితో తమ దుఃఖాన్ని పంచుకోవాలనే ఉంటుంది. కానీ, అలా ఒకరి ముందు తమ జీవితాన్నంతా పరిచి, తమ దుఃఖాన్నంతా పంచుకుందామని చూస్తే కచ్ఛితంగా ఓదార్పే లభిస్తుందన్న గ్యారెంటీ ఏమిటి ? అలాంటి వ్యక్తుల హృదయ సంవేదనలకు ప్రతిరూపంగా 'ఆప్ కీ పర్‌ఛాయియా' అనే సినిమాలోని ఈ పాట వినిపిస్తుంది.
రాజా మెఁహదీ అలీ ఖాన్ రచించిన ఈ గీతాన్ని మదన్ మోహన్ స్వరబద్దం చేశారు. స్వర సామ్రాజ్ఞిని లతా మంగేష్కర్ ఈ గీతాన్ని అద్భుతంగా ఆలపించారు.

అగ ర్ ముఝ్‌సే మొహబ్బత్ హై,ముఝే సబ్ అప్‌నే గమ్ దేదోఇన్ ఆంఖోంకా హర్ ఏక్ ఆసూఁముఝే మేరే క సమ్ దేదో / అగర్ ముఝ్ స/( నా మీద నీకు ప్రేమే ఉంటే- నీ బాధలన్నీ నాకు ఇచ్చేసెయ్నీ క ళ్లల్లోని ప్రతి అశ్రువును- నా మీద ఒట్టు నాకు ఇచ్చేసెయ్)

మానవ హృదయం సుఖ సంతోషాలకూ, వేదనలకూ, క్షోభలకూ వేదిక కదా! ప్రేమించిన వారు వారి సంతోషాల్ని పంచుకున్నట్లే దుఃఖాల్నీ పంచుకోవాలి కదా! అలా కాకుండా, నీ ఏడ్పు నువ్వు ఏడ్వు. నేను నీ జీవితంలోకి ప్రవేశించింది నీ ఏడుపును భరించడానికి కాదని ప్రియురాలో, అర్థాంగో అంటే ఏమిటి అర్థం? నీకున్న ప్రేమతో నాకెంత వైభోగ మైన జీవితాన్ని ఇస్తావో ఇవ్వు...అంతే తప్ప మిగతావేవీ వద్దు. అంటే ఇంకేముంది? నీ నుంచి కలిగే ప్రయోజనాలు పంచుకోవడానికే అయితే దారిన పోయే ఎవరైనా నీ దరికి చేరుకుంటారు. ప్రేమించిన వారికీ తేడా ఏముంది? నా మీద అని కాకుండా నిజంగానే నామీద నీకు ప్రేమ ఉంటే నీ బాధల్నీ, నీ కన్నీళ్లనూ నాకు ఇచ్చేసేయ్ అంటోంది ఈ ప్రియరాలు. నిజంగా ఇంత కన్నా పరణతి చెందిన ప్రేమమూర్తి ప్రపంచంలో మరెవరు ఉంటారు?


తుమ్హారా గమ్ కో అప్‌నా గమ్ బనాలూఁ తో కరార్ ఆయేతుమ్హారా దర్ద్ సీనేమే చుపాలూఁ తో కరార్ ఆయేవో హర్ శై జో తుమ్హే దుఖ్ దే ముఝే మేరే సనమ్ దేదో /అగర్ ముఝ్ సే/( నీ బాధల్ని నా భాధలుగా చేసుకుంటే నాకు నిశ్చింతనీ గాయాల్ని నా ఎదలో దాచేసుకుంటే నాకు నిశ్చింతనిన్ను బాధించే ప్రతి విషయాన్నీ ఓ ప్రియతమా నాకు ఇచ్చేసెయ్)

నువ్వు నా కోసం నిర్మించిన భవంతిలో విహరించడం ద్వారానో, నా కోసం తెచ్చిన ఆభరణాలను ధరించడం వ ల్లనో కాదు . నీ బాధల్ని నా బాధలుగా స్వీకరించడంలోనే నా మనసుకు నిశ్చింత, ప్రశాంతత అనే ప్రియురాలు. నీ గాయాల్ని తనలోకి ఒంపుకోవడంలోనే తన జన్మకు సార్థకత అనే ప్రియురాలు ప్రేమకు అసలు సిసలైన ప్రతిరూపం కాదా? సౌఖ్యాలు, సౌకర్యాల కోసమైన వెంపర్లాటలోనే సర్వశక్తులూ కరిగిపోతున్నాయి. 'నువ్వు నాకేం చేశావో చెప్పు..అంటే, నవ్వు మాత్రం నాకేం చేశావని?' అంటూ ఒకరినొకరు ఎద్దేవా చేసుకోవడంలోనే జీవితాలు ముగిసిపోతున్నాయి. ఎన్ని దశాబ్దాలు సహజీవనం చేసినా ఒకే గదిలో జీవించే ఇద్దరు వ్యక్తులు అవుతున్నారే గానీ, రెండు శరీరాలతో జీవించే ఒకే ఆత్మగా ఎదగడం లేదు. అలా ఒక ఉన్నతోన్నత స్థితికి ఎదిగిన ఓ అరుదైన జీవాత్మ ఆలాపనే ఈ గీతం.

శరీకే-జిందగీ కో క్యూఁ శరీకే గమ్ నహీ కర్‌తేదుఖోంకో బాంట్‌కర్ క్యూఁ దుఖోంకో కమ్ నహీ కర్‌తేతడప్ ఇస్ దిల్ కీ థోడీ-సీ ముఝే మేరే సనమ్ దేదో / అగర్ ముఝ్‌సే/( జీవితంలో భాగమైన బాధ ల్ని జీవితంలో ఎందుకు చేర్చుకోరు?బాధల్ని పంచుకుని బాధల్నెందుకు తగ్గించుకోరు?ఓ ప్రియతమా! హృదయపు ఆవేదనలో కొంతైనా నాకు ఇచ్చేసెయ్)

సమస్యలు,సంఘర్షణలే లేని జీవితాన్ని, గాయాలు, వ్యధలూ లేని జీవితాన్ని మనిషి కోరుకుంటాడు. వాటి తాలూకు ఛాయలు కూడా తన జీవితంలోకి రాకూడదనుకుంటాడు. కానీ, జీవితంలో అత్యంత అంతర్భాగమైన వాటిని దరిదాపులోకే రాకూడదనుకుంటే ఎలా? అది అసహజం కదా! అసాధ్యం కదా! అనుకోవడం వల్ల ఏదీ ఆగదు. ప్రపంచంలో ప్రతిదీ మన నియంత్రణలో ఉండదు. అడ్డుకునే ప్రయత్నాలు ఒక పక్కన చేస్తూనే ఉంటాం. అయినా కొన్ని శూలాలు గుండెలోకి దిగుతూనే ఉంటాయి. హృదయాన్ని కుదిపేస్తూనే ఉంటాయి. వాటిని ఎదుర్కోవడం ఒక్కరుగా సాధ్యం కానప్పుడు తన జీవితంలో భాగమైన, తన జీవనయానంలో సహబాటసారియైన ప్రేమమూర్తితో పంచుకోవచ్చు. ఆ వేదనను దుఃఖాన్ని సగమైనా తగ్గించుకోవచ్చు. ఇదేమీ రుణగ్రస్తమైపోవడం ఏమీ కాదు. అలాంటి పరిస్థితులు అవతలి వ్యక్తికి ఎదురైనప్పుడు నువ్వూ ఆ పాత్ర పోషిస్తావు కదా! అందువల్ల బాధల్ని పంచడానికి వెనుకంజ వేయాల్సిన అవసరమేమీ లేదు. కాకపోతే కష్టాల్లో తోడ్పాటును అందించిన వారి పట్ల కృతజ్ఞత కలిగిఉండడం విస్మరించకూడదు. అవకాశం వచ్చినప్పుడు అండగా నిలబడటంలో వెనుకంజ వేయకూడదు.


ఇన్ ఆంఖోంమే న అబ్ ముఝ్ కో కభీ ఆసూఁ నజర్ ఆయేసదా హస్‌తీ రహే ఆంఖే- సదా యే హోట్ ముస్కాయేముఝే సభీ ఆహే, సభీ దర్దో-అలమ్ దేదో / అగర్ ముఝ్‌సే/( నీ కళ్లల్లో ఇంకెప్పుడూ ఈ అశ్రువులు కనిపించకూడదునీ కళ్లెప్పుడూ నవ్వుతూ ఉండాలి- నీ పెదాల మీద ఎల్లప్పుడూ మందహాసమే ఉండాలినీ నిట్టూర్పులు, నీ ఆవేదన లు సమస్తమూ నాకు ఇచ్చేసెయ్)

ఒకడు కాలిపోతేనో, కూలిపోతేనో చూసి ఆనందించే వారే అత్యధికంగా ఉండే లోకంలో నీ కళ్లల్లో అశ్రువులు చూసే పరిస్థితి ఇంకెంప్పుడూ నాకు రాకూడదు. నీ కళ్లల్లో పెదాల్లో మందహాసం తప్ప మరేమీ కనిపించకూడదు అని ఆత్మీయంగా హెచ్చరించే ప్రేమమూర్తి ఎదురైతే, అంతకన్నా ఏంకావాలి? వాస్తవానికి ఒకరి జీవితంలో ముళ్లు పరిచి ఒకరి జీవితాన్ని కంటక ప్రాయం చే సి పొందే సంతోషం కన్నా, ఒకరి జీవితంలో పూలు పరిచి ఒకరి జీవితాన్ని కాంతిమయం చేయడంలో కలిగే ఆనందం వెయ్యి రెట్లు గొప్పది. ఈ మౌలిక సత్యాన్ని గుర్తించలేని మనిషి ఇతరులను ఎలాగూ సంతోషంగా ఉంచడు. కానీ, చివరికి తానూ సంతోషంగా ఉండలేడు. సంతోషాల్ని ఎవరైనా పంచుకుంటారు. కానీ, బాధల్ని పంచుకునేదో నిజమైన బంధం. అదే నిజమైన ఆనందం. ఎన్ని యుగాలుగా గడిచినా ఎందుకో అంతరంగంలో ఈ సత్యం ఎదగడం లేదు. ఎప్పటికైనా శుభపరిణామం వస్తుందని ఆశిద్దాం!

andhrajyothi lo nunchi...

Karthika Masam for Devotes:

Karthika masam starts on the day after deepavali and ends after 30 days.

This Year : Nov4- Dec2.

Here i am giving the basic rituals we should follow for this month. You can find the detailed vratha vidhanam in karthika puranam book.

1) One should not eat non veg food for the whole month.
2) Must take meal only once per day for the 30 days, we can eat breakfast at nights or atleast we must follow this on auspicious days like mondays, karthika poornima, koti somavaram etc.
3) Must take shower(including hair) daily.
4) Must light deepam every evening and do pooja.
5) Read one chapter in karthika puranam book everyday. If you don’t have karthika puranam read the story given in the below link daily http://www.teluguone.com/bhakti/shivastutulu/index.jsp?filename=kartika.htm
It is even good to hear the story if someone is reading it loud
6) Prepare prasadam on mondays , karthika poornima, koti somavaram and remaining days you can even keep some fruit as prasadam.