30, మార్చి 2014, ఆదివారం

నిర్జనవారధి











సమాజంలో మౌలిక మార్పులు కోరే సంస్కరణోద్యమం, జాతీయోద్యమం, విప్లవోద్యమం, నక్సల్బరీ ఉద్యమం అనే నాలుగు ఉద్యమాల వారధి కొండపల్లి కోటేశ్వరమ్మగారు. ఈ ఉద్యమాలలోని స్త్రీల పోరాటపటిమకు, వేదనకు కూడా ఆమె ప్రతినిధి. కోటేశ్వరమ్మ మూర్తీభవించిన ఉద్యమ రూపం. “నిర్జన వారధి” కోటేశ్వరమ్మగారి ఆత్మకథ. ఆమె జీవితం చదువుతుంటే ఒక వ్యక్తి జీవితంలో ఇంత దుఃఖం ఉంటుందా అని మనసు ఆర్ద్రమవుతుంది.
ఒడిదుడుకుల జీవితం
''నిర్జన వారధి'' .. ఈ మాట ఏదో అస్పష్టమైన విచారాన్ని తలపిస్తుంది. ఈపేరు వినగానే ఒకరకమైన విషాద దృశ్యం కళ్లముందు కదలాడుతుంది. నాలుగు ఉద్యమాలతో పాటు మూడు తరాలకు వారధి అయినా చివరికి ఆమె ఒంటరిగానే మిగిలిపోయింది. భర్త కొండపల్లి సీతారామయ్యతో ఒడిదుడుగుల అనుబంధం, పిల్లల మరణం లాంటి అనేక ఆటుపోట్లతో నిత్యం సంఘర్షణ అనుభవించిన కోటేశ్వరమ్మ స్వీయ కథే నిర్జన వారధి.
పుస్తకాలే ఆమె నేస్తాలు..
కోటేశ్వరమ్మ బాల వితంతువు. హైస్కూల్ చదువు కూడా లేని ఆమెకు ఆర్థికంగా ఏ ఆలంబనా లేకుండా పోయింది. అయినా ఎవరి సహాయమూ తీసుకోకుండా స్వశక్తితో తన కాళ్లపై తాను నిలబడటానికి నిశ్చయించుకొని, 35ఏళ్ల వయసులో హైదరాబాద్ ఆంధ్ర మహిళా సభలో మెట్రిక్ చదివారు. చదువుకుంటూ తనను తాను పోషించుకున్నారు. అనంతరం ఆమె సాహిత్యం వైపు అడుగేశారు. ఎన్నికష్టాలు ఎదురైనా సాహిత్యమే తనను బతికించిందని, పుస్తకాలే తన నేస్తాలని, అక్షరాలే తనకు ఆరోగ్యానిస్తాయని కోటేశ్వరమ్మ చెబుతారు.
ముందుమాటలో..
'' జ్ఞాపకాలను తట్టి లేపితే కన్నీటి ఊట ఉబికి వచ్చే జీవితం నాది. ఆ కన్నీటి ప్రవాహాన్నే కథగా మలిచాను. నా జీవిత కథ చదివిన పాఠకులు ఇది సంఘ శ్రేయస్సు కొరకు రాయబడిందనుకుంటే సంతోషిస్తాను. నా కథ మనిషిలోని మంచిని ఏ కొంచెమైనా పెంచుతుందనుకుంటే నా శ్రమ ఫలించిందనుకుంటాను. ఇన్నేళ్ల నా బ్రతుకు వృథా కాలేదని తెలిసి తృప్తిపడతాను'' అని కోటేశ్వరమ్మ 'నిర్జన వారధి' ముందుమాటలో తెలిపారు.
సత్యవతి విశ్లేషణ
'నిర్జన వారధి'ని కొండపల్లి సత్యవతి విశ్లేషించారు. 92 సంవత్సరాల వయసులో కోటేశ్వరమ్మ రాసిన ఈ పుస్తకం ప్రజలకు అందుబాటులోకి రావడం అదృష్టమన్నారు. కోటేశ్వరమ్మ జీవితంలోని సంఘర్షణను ఈ పుస్తకంలో పొందుపరిచారని తెలిపారు. తన జీవితంలోని బాధలకు ఎక్కడా ఎవరినీ నిందించని గొప్ప వ్యక్తిత్వం కోటేశ్వరమ్మదని పేర్కొన్నారు. ఈ పుస్తకం చదివితే ఆమె వ్యక్తితం ఎంతో ఉన్నతంగా కనిపిస్తుందని తెలిపారు. జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా ఎక్కడా తొణకని స్వభావం కోటేశ్వరమ్మదని కొనియాడారు. ఈ పుస్తకం చదివే వరకు ఆమె జీవితంలో ఇంత విషాదం ఉందని ఎవరికీ తెలియదన్నారు. తనను వదిలేసిన భర్త తిరిగి కొన్నేళ్ల తర్వాత రమ్మని పిలిస్తే ఎంతో హుందాగా ఆ ఆహ్వానాన్ని తిరస్కరించారని సత్యవతి వివరించారు.
ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా జీవిత పోరాటాన్ని సాగిస్తున్న కోటేశ్వరమ్మ జీవితం భావితరాలకు 'వారధి' గా నిలుస్తుంది. 

ఫై వ్యాసం 10 టీవీ  నుంచి  తీసుకోనపడింది.

నా అభిప్రాయం :

 
ఈరోజు లో చిన్న చిన్న విషయాలకే అనేకమంది ఆత్మహత్యలు  చేసుకుంటున్నారు. కోటేశ్వరమ్మ  గారి జీవిత చరిత్ర ఎంతోమందికి ఆదర్శం అవుతున్ది. 
 
 
అడుగడుగునా కోటేశ్వరమ్మ గారి జీవితం లో కష్టాలు ఎన్ని వచ్చిన  ఆమె పదేపదే పైకి ఎగసే ఫీనిక్స్‌ పక్షి లానే
మొక్కవోని ఆత్మవిశ్వాసం  తో జీవించారు. 
 
 
భర్త కొండపల్లి సీతారామయ్యతో విభేదాలు ఒంటరిని చేస్తే 36 ఏళ్ళ వయసులో మెట్రిక్ పాసయ్యి  జాబు తెచుకున్నరు. 
 
కరుణ, చంద్ర  వీరి  పిల్లలు. రమేష్ ( అల్లుడు) మరణం తరువత కరుణ ఆత్మహత్య. చంద్ర ఎన్కౌంటర్. అ ఫై తల్లి మరణం . 
ఒక  మనిషికి ఎన్ని బాధల అనిపిస్తున్ది. 
 
కొండపల్లి సీతారామయ్య గారి చివరి రోజుల్లో ఆయన్ని కలవమని మిత్రులు ఒత్తిడి తెచ్చినపుడు తన అయిష్టతని వ్యక్తం చేస్తూ ‘ఆయన పాలిటిక్స్‌ ఆయనవి నా పాలిటిక్స్‌ నావి’ అని అనుకోగల ఆత్మవిశ్వాసం కోటేశ్వరమ్మగారిది. ఆఖరిదశలో కోటేశ్వరమ్మతో కలిసుండాలన్న ఆకాంక్షను సీతారామయ్య వ్యక్తం చేసినపుడు ‘యాజ్‌ ఎ ఫ్రెండ్‌గా ఉండటం వేరు. ఈ భార్యాభర్తల గొడవ నాకొద్దు’ అని సున్నితంగా తిరస్కరిస్తారు.
కోటేశ్వరమ్మ గారి జీవితంలోని పలువిషాద సంఘటనలు కంటతడి పెట్టించి మనసుని ఆర్ద్రం చేస్తాయి. అయితే అది నిస్సహాయ దుఃఖం, నిరుపయోగశోకం కాదు.
 
 
 
 
 
 
 
 
 
 
 
 





 

2 కామెంట్‌లు: