31, మే 2014, శనివారం

మూలింటామె





నామిని సుబ్రహ్మణ్యం నాయుడు గారు రాసిన అద్బుతం అయిన కధే ఈ మూలింటామె.  రచయిత కధ ని
చిత్తూరుయాస లో రాశారు. తేలిగ్గా అర్ధం కాదేమో అనుకున్నాను గాని చదువుతూ ఉంటె సులువుగా సాగిపోయింది. నామిని గారు మూలింటామె లోకి పరకాయ ప్రవేశం చేసినట్టు అనిపించింది. ఉత్తమ పురుషలో చెప్పకపోయినా ఒక స్త్రీ కోణం లోంచి కథని నడిపించడంలో గొప్ప నేర్పు చూపిస్తూ ఒక కుగ్రామాన్ని , అందులోని మనుషుల్ని, వాళ్ళ జీవితాలని ఎలాంటి కల్తీ లేకుండా కళ్ళకి కట్టించారు.
రచయిత కి మానవ సంబందాల గురించి మనసు లోతుల గురించి గొప్ప అవగాహనా వున్నా వ్యక్తి గా ఈ కధ  చదివాకా మనికి అనిపిస్తారు.


ఇక కధ విషయానికి వస్తే  చిత్తూరు  జిల్లా లో ఒక మారుమూల  కుగ్రామం పేరు మిట్టూర్. ఊరి చివర మూలలో వాళ్ళ అడ్డాపింట్లో  కుంచమామ్మ తన  కూతురు మొగిలమ్మ , కొడుకు నారాయణ సామీ నాయుడు  మనమరాలు/కోడలు  ిన రుపావతి తో వుంటుంది.  రూపవతి కి ఇద్దరు బిడ్డలు . ఊరిలో అందరు కుంచమామ్మ ని  ములింటి మొదటామె అని  మొగిలమ్మ ని నడిపామే  అని రూపవతి ని కొనమ్మి అని  పిలుస్తునాటారు.

కొనమ్మి ఇల్లు వదిలి వెళ్ళిపోవడం తో కధ  మొదలవుతుంది. కాసేపటికి  కళాయి వాడితో ( మాట్లు  వేసుకొనేవాడు)
తిరప్తి ( తిరుపతి) కి పోయిందని తెలిసి ఊరువాడా  ఇంటి ముందు పొగవుతారు. ఒక మనిషి తప్పు చేస్తే అ తప్పు కి కారణాలు వెదకరు. అ తప్పు ఎందుకు చేసారో అస్సలు అలొచించరు. ఎప్పుడు తప్పు చేస్తారా అని కాచుకుకుర్చున్న జనం ఇక కాకుల పొదిచెస్తరు. ఈ కధ లో  మొలకమ్మ,రంజకం  మొదలిన వాళ్ళు వీలు దొరికినప్పుడల  వినడానికి వీలుకాని పదాలతో ములింటి వాళ్ళకి ఊపిరి సలపనివ్వరు .

మొదటామె కి  మనమరాలు అంటే పంచ ప్రాణాలు. కొనమ్మి ఎప్పటికిన  తిరిగి వస్తది అని ఎదురుచూస్తూ వుంటుంది . కొనమ్మి వెల్లిపొఇన రాత్రి కొనమ్మి ఫోటో ముందుపెట్టుకొని బాధపడుతుంది తను అడిగే మాటలు మనసుని హత్తుకుంటాయి. భీమారం నుంచి వచ్చిన అక్క నడిపమే ఇద్దరు కలిసి నారాయుడి కి ఇంకో పెళ్లి చేస్తారు.

అ కోడలి పేరు వసంత. లావుగా ఉంటుందని అందరు పందోసంత  అంటారు. కోడలి చేత గంజినీలు కూడా ముట్టుకోదు. అంత పట్టుదల మొదటామేకి.మనవరాలి చోటు ఆక్రమించుకుందని బాధ పందోసంత  పనులు చిత్రహింసలకి గురిచెస్తయి.  పందోసంత  ఇంటిముందు చెట్లు అన్ని కొట్టించి  అంగడి పెదుతున్ది. డబ్బు వడ్డిలకిస్తూ వుంటుంది .  గుడు గుడు చంద్రుడి తో ఎఫైర్ పెట్టుకొని బిడ్డను కంటుంది . పందోసంత ఇచ్చే డబ్బు కి  ఆశపడి తన తప్పు ని సమర్దిస్తువుంటారు. జీవితంలో ఒకే ఒక తప్పు చేసిన మనమరాలిన అన్ని మాటలు అంటుంటే సహించలెకపోతుంది.  అవును మరి ఇవాల్టి రోజున బలమున్నోడిది ఫై చెయి. నేటి సమాజంలో వున్నా కొంతమంది  మనుషులకి సింబాలిక్ గా రచయిత ఈ పాత్ర ని సృష్టించారు అని అనిపిస్తుంది .

మొదటామె   పిల్లుల్లు ని ప్రాణం గ పెంచుకుంటుంది. పందోసంత కి పొలం అమ్మి తండ వ్యాపారం ( వడ్డీ) కి డబ్బు ఇవ్వాలని వుటుంది.  మొదటామె  సంతకం పెట్టను  అంటుంది . ఆమె ని బెదిరించడానికి  2 పిల్లులిని చంపుతుంది.
ఇక చూడలేక వోడిసాకు  తిని చచ్చిపోతు చిమంతమ్మ చెవిలో  "నా మనమరాలు మొగుణ్ణి వదిలేసినిది కానీ మియం మియం అంటూ ని కాళ్ళ కాడ నా  కాళ్ళ కాడ  చుట్టుకులాడే పిల్లిని చంపలేదే"  అంటుంది.  ఈ మాటలు పుస్తకం చదివాకా కూడా మన చెవుల్లో రింగ్ రింగు మంటూ తిరుగుతూనే వుంటాయి. ముసలి అమ్మమ్మ పాత్ర నాకు బాగా నచ్చింది. ఆమె లో ఆమె చెప్పుకొనే మాటలు ఇతరుల ప్రశ్నలకి మనసులోనే చెప్పుకొనే సమాధానాలు చదివి తీరలిసిందే.

ఈర్ష్య ,అసుయలికి సింబాలిక్ గా  రంజకం ,మొలకమ్మ, రంగాబిల్ల పాత్రలు  వున్నయి .  ఇంకా కాస్త మంచి మిగిలే వుంది అని చెప్పటానికి  చిమంతమమ్మ  పాత్ర వుంది . 

మనమరాలు చేసిన తప్పుని అర్ధం చేసుకొని క్షమించే గుణం విద్యవంత్లో కూడా వుండదు. రచయిత సమాజం లో పరిస్తితుల్ని ఎంత బాగా అర్డంచేసుకొని రాసాడో అనిపిస్తున్ది.మనసున్న ప్రతి మనిషి కి నచ్చే కధ  ఇది.

















 

4 కామెంట్‌లు: